మనదేశం లో జనాభాకి అనుగుణంగా సౌకర్యాల లేమి కారణంగా… బస్సు లో సీటు కోసం రైలులో సీటు కోసం కొట్టుకోవడం రెగ్యులర్ గా జరుగుతుంటుంది. చాలా మంది సీటు నాదంటే నాది అని కిటికోలోంచి కర్చీఫ్ వేశానని గొడవలకు దిగుతుంటారు. అయితే మరీ దారుణంగా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం దారుణంగా దూషించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంటాయి.
అయితే తాజాగా కర్ణాటక లో రాష్ట్రం లోని ప్రభుత్వ బస్సులో జరిగిన ఒక ఫైట్.. ఆన్ లైన్ లో వైరల్ గా మారుతుంది. కర్ణాటక ప్రభుత్వం లో బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ తో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో.. సీటు కోసం కొందరు మహిళలు ఘోరంగా గొడవపడ్డారు. చీరలు లాక్కుని మరీ ఫైట్ చేసుకున్నారు. ఈ సమయం లో వారి గొడవ మధ్య లోకి వెళ్లిన యువకులు కూడా కొట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కాగా… కర్నాటక ఎన్నికల్లో ఇచ్చిన మహిళల కు ఉచిత ప్రయాణం హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంది. ఇందులో భాగంగా “శక్తి యోజన” పథకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. విద్యార్థినుల తో పాటు హిజ్రాలుకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. దీంతో… కర్ణాటక రాష్ట్రం లోని బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది.