ఆంధ్రప్రదేశ్ లో 2024 శాసనసభ ఎన్నికలకు మూడు పార్టీలు కలసి పోటీ చేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి గత ఎన్నికల్లో బరిలోకి దిగి 164 అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నాయి. కూటమి ఏర్పడిన తర్వాత మూడు పార్టీల అగ్ర నేతలు కలసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని అందులో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ చేశాయి. రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీని కూడా మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేశాయి. మూడు పార్టీల నుంచి ముఖ్యమైన ఇద్దరు నేతల చొప్పున రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఎన్నికలకు ముందు మాత్రమే ఈ సమన్వయ కమిటీ పనిచేసింది.
