ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న వారికి మరో రెండు వారాల్లో తీపి కబురు అందనుంది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఏపీలోని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కొత్త పెన్షన్లను డిసెంబరు నెల నుంచి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
