ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌పై విచారణకు ఆదేశం…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌పై విచారణకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశించింది. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై ఏపీ ప్రభుత్వం విచారణ అథారిటీని నియమించింది. ఇందులో ఆర్పీ సిసోదియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సునీల్ కుమార్‌పై ఏసీబీ డీజీకి మరో లేఖ రాశారు.

సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సునీల్ కుమార్‌పై వచ్చిన అభియోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను సభ్యులుగా నియమించారు. సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏసీబీ డీజీకి లేఖ రాశారు. ప్రైవేట్ టెక్నాలజీస్ కాంట్రాక్ట్ నిధుల మళ్లింపులో సునీల్ కుమార్ ప్రమేయం ఉందని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. నకిలీ ఖాతాలకు రూ.75 లక్షలు మళ్లించారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తూ ఏసీబీ డీజీకి లేఖ రాశారు. మిగతా డబ్బు ఇవ్వాలని సునీల్ కుమార్ బెదిరించినట్లు రఘురామ ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసులో సునీల్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డారని.. రఘురామ లేఖలో ఆరోపించారు. అలాగే తులసిబాబుతో కలిసి సునీల్ కుమార్ నిధుల దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు ఏసీబీ డీజీకి రాసిన లేఖలో కోరారు.

మరోవైపు సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు ఢిల్లీ స్థాయిలో కూడా ఫిర్యాదులు చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. పలు అంశాలలోనూ సునీల్ కుమార్ మీద ఆరోపణలు, అభియోగాలు చేశారు. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ మీద వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగు తీసేందుకు ఏపీ ప్రభుత్వం అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో ఆర్పీ సిసోడియా, హరీష్ కుమార్ గుప్తాలను నియమించింది. వీరు విచారణ చేసి.. నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఐపీఎస్ అధికారి మీద విచారణ అథారిటీని ఏర్పాటు చేయటం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these