పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు నోళ్లు మూగవోయాయి. అధికారంలో ఉన్ననాళ్లు, లేని నాళ్లు పల్నాడు ప్రాంతం గట్టిగా వాయిస్ వినిపించే నేతలు నేరు కామ్ అయిపోయారు. మాచర్ల, నరసరావుపేట, గురజాల నేతలు అస్సలు ఎక్కడ? అంటూ వైసీపీ నేతలే విస్తుపోతున్నారు. గతంలో 2014లో అధికారం లేనప్పుడు కూడా ఇలాంటి పరిస్థిితి లేదు. కానీ ఈసారి మాత్రం అందరూ నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారు. దీనిపై క్యాడర్ కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఒక్క అంబటి రాంబాబు మినహా మాత్రం ఎవరూ నోరు ఎత్తడం లేదు. కనీసం రోడ్డు మీదకు వచ్చి వైసీపీకి మద్దతుగా నిలబడటం లేదు.
