టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పలువురు వైసీపీ నేతల తరఫున దేవినేని అవినాష్ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

ఈ కేసులో పోలీసుల తరఫున కేఎం కృష్ణారెడ్డి, అవినాష్ తరఫున సినీయర్ న్యాయవాది రవిచందర్ తమ వాదనలు వినిపించారు. రాగా ఈ కేసుతో సంబంధం ఉన్న వైసీసీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్‌, జోగి రమేష్‌లకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. కేసులో తదుపరి విచారణకు ఈనెల 16కు వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these