యూరియా వాడకం తగ్గించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ మేరకు యూరియా వాడకం రైతులు తగ్గించేలా ప్రోత్సహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
యూరియాను తగ్గించడంపై…
ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతులకు అందజేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో ప్రకటించారు. రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారని, దాని వల్ల మిరపను చైనా నుంచి తిప్పి పంపారని చంద్రబాబు పేర్కొన్నారు. కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.