మెడికల్ కాలేజీల వ్యవహారం.. కూటమి మంత్రులకు రోజా సవాల్

మెడికల్ కాలేజీల వ్యవహారం.. కూటమి మంత్రులకు రోజా సవాల్

మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలోని కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. కూటమి మంత్రులు వస్తే మెడికల్‌ కాలేజీల నిర్మాణం చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలానే మహిళా మంత్రులైన అనిత, సవితలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరు చూశారు. ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చి వేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని తలలు పట్టుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. మొదటిసారి సీఎంగా గెలిచిన వైఎస్‌ జగన్‌ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని.. వాటిల్లో ఆరు మెడికల్ కాలేజీలు రన్నింగ్‌లోకి తీసుకువచ్చారని తెలిపారు. చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేసినా.. ఎందుకు ఆయన ఆ పని చేయలేకపోయారని ప్రశ్నించారు. ఐదువేల కోట్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఖర్చు చేయలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రైవేటీకరణ జీవో వెనక్కి తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడు అనే విధంగా మంత్రి సవిత ప్రవర్తన ఉందంటూ తీవ్ర రోజా తీవ్ర విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these