డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. రెండు శాతం రాయితీ..

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు.. రెండు శాతం రాయితీ..

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలలోని మహిళలకు తీపికబురు వినిపించింది. వడ్డీల మీద రెండు శాతం రాయితీ ఇస్తోంది. డ్వాక్రా సంఘాల మహిళల బ్యాంక్ లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాలు తీసుకుంటూ ఉంటారు. వీటిపై 13, 12 శాతం వడ్డీ విధిస్తుంటారు. అయితే స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ రుణాల వడ్డీపై రెండు శాతం రాయితీ ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ మేరకు డ్వాక్రా సంఘాలకు ఉపశమనం లభించనుంది. అయితే పావలా వడ్డీ రుణాలకు కేవలం మూడు లక్షల వరకే పరిమితి ఉండగా.. ఇప్పుడు ఎంత రుణం తీసుకున్నా కూడా వడ్డీలో రెండు శాతం రాయితీ లభిస్తుంది.

మహిళా సాధికారత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తోంది. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. స్త్రీ నిధి రుణం మీద 12 శాతం వడ్డీ ఉంటే.. బ్యాంక్ లింకేజీ రుణాలపై 13 శాతం వడ్డీలు వసూలు చేసేవారు. అయితే డ్వాక్రా మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై ఏపీ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. రెండు రకాల రుణాల వడ్డీలలోనూ రెండు శాతం చొప్పున రాయితీ అందిస్తోంది. దీంతో స్త్రీ నిధి రుణం మీద వడ్డీ 10 శాతంగా, బ్యాంక్ లింకేజీ రుణంపై వడ్డీ 11 శాతంగా ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these