రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధిని… 20 శాతానికి తీసుకెళ్లి స్వర్ణాంధ్ర లక్ష్యాలను నెరవేరుస్తామని… మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు. పర్యాటక రంగంలో… ‘ఆకాశమే హద్దు-అవకాశాలు వదలొద్దొన్న’ సీఎం సూచనలతో ముందుకు వెళ్తున్నామన్నారు. గత ప్రభుత్వ దుష్పరిణామాలు పునరావృతం కాకుండా చేస్తామని… స్వేచ్ఛాయుతంగా పెట్టుబడులు పెట్టాలని దుర్గేష్ పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాల కల్పిస్తామన్నారు.
