TDP Mahanadu 2025: వారికి శిక్షలు తప్పవు.. ఏపీ అభివృద్ధికి సైనికుడిలా పోరాటం చేస్తా: సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్

వారికి శిక్షలు తప్పవు.. ఏపీ అభివృద్ధికి సైనికుడిలా పోరాటం చేస్తా: సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్

కడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది.. ముందుగా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది.. ముందుగా.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుడిలా పోరాటం చేస్తానని.. పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్ర ప్రధేశ్ భవిష్యత్‌ను మారుస్తానని చెప్పారు. రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్‌ సెట్టర్‌ అని.. టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా.. అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపార్టీలో చూసినా తెలుగు దేశం యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని.. టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు.

జగన్‌ పాలనలో అవినీతిపై విచారణలు జరుగుతున్నాయని.. తప్పుచేసిన వైసీపీ నాయకులు, అధికారులకు శిక్షలు తప్పవన్నారు చంద్రబాబు. వైసీపీ నాయకుల అవినీతి సొమ్మును కక్కిస్తామని మహానాడు వేదికగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవినీతి అంతం కోసం పెద్ద నోట్లను రద్దు చేయాలని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these