అంజనమ్మకు అస్వస్థత.. చిరు టీం ఏం చెప్పిందంటే?

అంజనమ్మకు అస్వస్థత.. చిరు టీం ఏం చెప్పిందంటే?

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మకు ఆరోగ్యం బాగా లేదు, అస్వస్థతకు గురైందంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై చిరంజీవి టీం వెంటనే స్పందించింది. అంజనమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారని టీం క్లారిటీ ఇచ్చింది. దీంతో అంజనమ్మ ఆరోగ్యం బాగా లేదంటూ వస్తున్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. రీసెంట్‌గానే అంజనమ్మ పుట్టిన రోజు వేడుకల్ని చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన కలిసి ఎంత గొప్పలా సెలెబ్రేట్ చేశారో అందరూ చూశారు.

అంజనమ్మను చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు ఎంత బాగా చూసుకుంటారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అంజనమ్మ చిరు వద్దే ఉంటున్నారు. అంజనమ్మ బాగోగులన్నీ కూడా చిరు దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాడు. రీసెంట్‌గా అంజనమ్మ బర్త్ డేకు చిరు సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఉపాసన ఇళ్లంతా డెకరేట్ చేసి పెట్టింది. రామ్ చరణ్ ఆ విజువల్స్ అన్నీ కూడా తన కెమెరాలో బంధించాడు.

అంజనమ్మ రీసెంట్‌గా మళ్లీ అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. వీడియో బైట్ ద్వారా అంజనమ్మ, సురేఖ కనిపించారు. రామ్ చరణ్ మీద తమ తమ ప్రేమను వ్యక్త పరిచాడు. తనకు, తన కోడలికి మధ్య తన మనవడు రామ్ చరణ్ ఎలాంటి గొడవలు పెడతాడో అంజనమ్మ చెప్పి నవ్వించారు. రామ్ చరణ్ ఎప్పుడూ కూడా తమ మధ్య పుల్లలు వేస్తుంటాడని సురేఖ సైతం చెప్పి నవ్వించారు.

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ఇంట్రో సాంగ్‌ను చిత్రీకరించారు. పైగా ఇందులో సాయి ధరమ్ తేజ్, నిహారిక వంటి వారు స్పెషల్‌గా కనిపిస్తారని సమాచారం. చిరు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. చిరు స్టైల్లోనే ఉంటూ.. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్‌తో చిత్రం ఉంటుందని సమాచారం. ఆ తరువాత చిరు ఓదెల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these