తన మార్క్ రాజకీయంతో ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్న జక్కంపూడి రాజా..రాజానగరం జనసేనకు భారీ షాక్…

జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిన రాజానగరం జనసేన మాజీ ఇంచార్జి శ్రీ మేడా గురుదత్త ప్రసాద్ గారు.
గురుదత్ ప్రసాద్ తో పాటు పార్టీకి రాజీనామా చేసిన కోరుకొండ మండల కన్వినర్ మండపాక శ్రీను, సీనియర్ నాయకులు అడబాల సత్యనారాయణ, నాగారపు భాను శంకర్,తదితరులు.మంచి మనుషులు పార్టీని వీడటంతో దిక్కుతోచని స్థితిలో రాజానగరం జనసేన.కొత్తగా వచ్చిన ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ వల్లే పార్టీకి మొదటనుండి కష్టపడుతున్న వారు అంతా దూరం అవుతున్నారు అని పార్టీలోని సీనియర్ నాయకుల ఆవేదన.

16 సంవత్సరాలుగా మెగా కుటంబంతోనే ఉన్న మేడా..
మేడా రాకతో ప్రతి గ్రామంలో జనసేన నుంచి భారీగా పార్టీని వీడనున్న నేతలు, కార్యకర్తలు.రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలంలో పూర్తిగా ఖాళీ కానున్న జనసేన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may also like these